News January 31, 2025

నేడు మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్: DEO

image

పదో తరగతి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల స్థాయి పరీక్షలు ఈనెల 31న ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరు కావాలని చెప్పారు. ప్రతి మండలం నుంచి ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయాలని పేర్కొన్నారు.

Similar News

News February 10, 2025

వైసీపీ ముఖ్య నేతలతో గుడివాడ సమావేశం

image

విశాఖ వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో ఇటీవల నియమించిన అనుబంధ సంఘాల అధ్యక్షులతో పలు విషయాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, రమణికుమారి ఉన్నారు.

News February 10, 2025

జోగులాంబ: ఐదుగురు డ్రైవర్ల పై కేసులు నమోదు

image

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 5 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

News February 10, 2025

ఏపీలో లిక్కర్ ధరలు పెంపు!

image

AP: రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మద్యంపై 15 శాతం మేర ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇకపై 3 కేటగిరీలుగా(ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్) మద్యం సరఫరా ఉంటుందని తెలిపాయి. రూ.99 మద్యం, బీర్లపై పెంపు ఉండదని చెప్పాయి.

error: Content is protected !!