News April 5, 2025
నేడు మంథని నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సు

శ్రీ రామనవమి కళ్యాణోత్సం కోసం మంథని నుంచి భద్రాచలం వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు మంథని డీఎం శ్రావణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, ఆదివారం కళ్యాణోత్సవం తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి మంథనికి బయలు దేరుతుందని పేర్కొన్నారు. ఫుల్ టికెట్ రూ.450, హాఫ్ టికెట్ రూ.225, మహిళలకు ఉచిత పథకం ఉందని తెలిపారు.
Similar News
News October 15, 2025
UN HRC మెంబర్స్గా ఇండియా, పాకిస్థాన్

ఐక్యరాజ్య సమితి 2026-28కి గాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ను ఎన్నుకుంది. మెంబర్స్గా అంగోలా, చిలీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్టోనియా, ఇండియా, ఇరాక్, ఇటలీ, మారిషస్, పాక్, స్లోవేనియా, SA, UK, వియత్నాంను ఎన్నుకుంది. నిత్యం మానవ హక్కులను కాలరాసే పాక్లాంటి దేశానికి UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 15, 2025
ఈ నెల 16న నిర్మల్లో జాబ్ మేళా

ఈ నెల 16న నిర్మల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి గోవింద్ తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో ఖాళీలు ఉన్నాయన్నారు. దాదాపు 68 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 15, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.