News February 22, 2025

నేడు మల్లన్నకు టీటీడీ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా నేటి శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అలాగే ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం(కాణిపాకం) శ్రీ స్వామి అమ్మ వార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాస్త్రోక్తంగాపట్టు వస్త్రాలను ఆయా దేవస్థానాల ఈవోలు, అధికారులు, అర్చకులు సమర్పించనున్నారు.

Similar News

News October 25, 2025

నిజామాబాద్ రూపురేఖలు మారాలి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ నగర రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా నగర పాలక సంస్థ పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో నగర పాలక సంస్థ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ, బల్దియా ఆస్తుల పరిరక్షణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై చర్చించారు.

News October 25, 2025

దాని బదులు చావును ఎంచుకుంటా: లాలూ కుమారుడు

image

RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి తండ్రి పార్టీలో చేరే బదులు చావును ఎంచుకుంటానని చెప్పారు. తనకు నైతిక విలువలు, ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆయనను ఆర్జేడీ బహిష్కరించింది. ఈ క్రమంలో జనశక్తి జనతాదళ్ పార్టీ స్థాపించిన ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగుతున్నారు.

News October 25, 2025

JMKT: మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

JMKT మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు రైతులు 1,200 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,100 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది. CCI ద్వారా అమ్మిన 26.40 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.7866.70, కనిష్ఠంగా రూ.7785.60 ధర లభించింది.