News February 22, 2025
నేడు మల్లన్నకు టీటీడీ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా నేటి శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అలాగే ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం(కాణిపాకం) శ్రీ స్వామి అమ్మ వార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాస్త్రోక్తంగాపట్టు వస్త్రాలను ఆయా దేవస్థానాల ఈవోలు, అధికారులు, అర్చకులు సమర్పించనున్నారు.
Similar News
News November 24, 2025
ఖమ్మం: విశ్వామిత్ర చౌహాన్కు వరల్డ్ రికార్డు

ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ ‘విశ్వ గురు వరల్డ్ రికార్డు’ను అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ కుమారి శ్రీలు, ఇంటెలిజెన్స్ ఏసీపీ రాజీవ్ రెడ్డి, నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా చౌహాన్ ఈ ప్రతిష్ఠాత్మక రికార్డును స్వీకరించారు. అతిథులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు
News November 24, 2025
నెలకు రూ.25 వేలతో ఉద్యోగాలు

ధర్మవరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఈనెల 26న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. నెలకు రూ.15,000 నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని పేర్కొన్నారు.
News November 24, 2025
రాష్ట్ర బ్యాంకుల్లో రూ.2,200 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్

TG: రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లోని 80 లక్షల ఖాతాల్లో రూ.2,200 కోట్ల అన్క్లెయిమ్డ్ సొమ్ము ఉన్నట్లు RBIకి సమర్పించిన నివేదికలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. SBIలోనే దాదాపు 21.62 లక్షల అకౌంట్లలో సుమారు రూ.590Cr ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నిధులను ఖాతాదారులు లేదా వారి వారసులకు అందజేసేందుకు బ్యాంకులు ఈ ఏడాది DEC 31 వరకు ‘వారసుల వేట’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి.


