News January 28, 2025
నేడు మహబూబాబాద్లో మెగా జాబ్ మేళా

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఏటూరునాగారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని సోమవారం డిప్యూటీ డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కావున, ఆసక్తిగా ఉన్న గిరిజన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాను మంగళవారం ఉ.10కు మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 28, 2025
సిద్దిపేట: గంగాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 28, 2025
విజయవాడలో డయేరియా కేసులు.. వాస్తవమెంత.?

న్యూ RRపేటలో మరోసారి డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. వైద్యులు మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు మాత్రమే నమోదైందని, ఇది సాధారణమేనని అంటున్నారు. ఏళ్లనాటి పైపులైన్ల లీకుల కారణంగా కలుషిత నీరు వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి కాలుష్యం జరిగి డయేరియా కేసులు నమోదవుతున్న క్రమంలో అధికారులు వాటర్ బబుల్స్, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు తప్ప, సమస్యకు పరిష్కారం చూపడం లేదు.
News November 28, 2025
GWL: అనైతిక చర్యలకు ఆరేళ్లు నిషేధం: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనైతిక చర్యలకు పాల్పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని గద్వాల కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. పదవులను వేలం వేయడం, ఓటర్లను డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు భారత శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయరాదని సూచించారు.


