News April 12, 2025

నేడు యథావిధిగా కొనసాగనున్న రిజిస్ట్రేషన్లు

image

నేడు రెండో శనివారం సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రిజిస్ట్రేషన్లు  చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Similar News

News December 12, 2025

NLR: ఒకే చీరకు ఉరేసుకుని భార్యాభర్తల సూసైడ్

image

నెల్లూరు జిల్లాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. టీపీగూడూరు మండలం వరకవిపూడికి చెందిన ఈదూరు నరేశ్(34), ప్రమీలమ్మ(28) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఇంట్లోనే ఒకే చీరకు ఉరేసుకున్నారు. కుటుంబంలో ఏం జరిగింది? ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 12, 2025

నెల్లూరులో పొలిటికల్ హీట్ !

image

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

News December 12, 2025

నెల్లూరులో పొలిటికల్ హీట్ !

image

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.