News March 10, 2025
నేడు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఉదయం 11గంటలకు ఆయన ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగమైన పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు.
Similar News
News March 15, 2025
ఆ హీరో కోసమే ప్రత్యేక పాటలో డాన్స్ వేశాను: గుత్తా జ్వాల

హీరో నితిన్ కోసమే తాను ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ప్రత్యేక గీతం చేశానని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఆ సినిమా కంటే ముందు నాకు చాలా సినిమా ఛాన్సులు వచ్చినా ఒప్పుకోలేదు. నితిన్ నాకు బెస్ట్ ఫ్రెండ్. తన సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలని అడిగాడు. నాకు ఆసక్తి లేకపోయినా తన ఒత్తిడి వల్లే ఆ సాంగ్ చేశాను. ఆ పాట తన సినిమాకు హెల్ప్ అయింది’ అని గుర్తుచేసుకున్నారు.
News March 15, 2025
BRS హయాంలో కంటే మా పాలనలోనే ఎక్కువ రుణమాఫీ: భట్టి

TG: KCR, హరీశ్ రావు, KTR సొంత నియోజకవర్గాల్లో BRS హయాంలో కంటే కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గజ్వేల్లో అప్పట్లో రూ.104 కోట్ల రుణమాఫీ జరిగితే ఇప్పుడు రూ.237 కోట్లు, సిద్దిపేటలో గతంలో రూ.96 కోట్ల మాఫీ అయితే తమ పాలనలో రూ.177 కోట్లు, సిరిసిల్లలో అప్పుడు రూ.101 కోట్లు మాఫీ చేస్తే తాము రూ.175 కోట్ల మాఫీ చేసినట్లు వెల్లడించారు.
News March 15, 2025
విశాఖలో జూన్ 1నుంచి జరిమానా

సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు స్వస్తి పలుకుదామని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్ అన్నారు. శనివారం విశాఖ ఆర్కె బీచ్ వద్ద స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జనవరి 1నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పినా అక్కడక్కడ కనిపిస్తూన్నాయన్నారు. జూన్ 1నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులకు జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.