News April 25, 2024

నేడు విజయనగరంలో చంద్రబాబు, పవన్ రోడ్ షో

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. డెంకాడ మండలం సింగవరం వద్ద సా.4 గంటలకు ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో వారు పాల్గొంటారు. సభ జరిగే ముందు సింగవరం వద్ద రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం విజయనరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రజాగళం సభలో వారు ప్రసంగించనున్నారు. వీరి పర్యటన నిమిత్తం చందకపేట వద్ద రెండు హెలీప్యాడ్‌‌లు ఏర్పాటు చేశారు.

Similar News

News December 9, 2025

VZM: జీజీహెచ్ సేవల మెరుగుదలపై అధికారుల సమీక్ష

image

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, MLA పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొని ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల రద్దీ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాల అప్‌గ్రేడేషన్, శుభ్రత, వైద్యసిబ్బంది బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఇతర వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

News December 9, 2025

ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

image

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 9, 2025

ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

image

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.