News February 23, 2025

నేడు విజయవాడకు వైఎస్ జగన్ రాక

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదివారం విజయవాడకు రానున్నారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి సాయంత్రం 4.40కి బయలుదేరి 6:25కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌కు 6.55కు చేరుకొని మల్లాది కుమార్తెను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లి వెళ్తారు.   

Similar News

News November 21, 2025

సిటీలో మరో ఉపఎన్నిక.. 3 రోజుల తర్వాత క్లారిటీ!

image

సిటీలో మరో ఉపఎన్నిక రానుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పార్టీ మార్పుపై స్పీకర్‌కు సమాధానం ఇవ్వలేదు. కాగా దానం‌కు స్పీకర్ 3రోజులు గడువిచ్చారు. ఈలోపు ఆయన నుంచి స్పందనరాకపోతే ‘అనర్హత’పై స్పీకర్ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక్కడ ఉపఎన్నిక ఖరారైనట్లే.

News November 21, 2025

ADB: జల వనరుల సుస్థిరతకు అడుగేద్దాం..!

image

​నింగిని తాకే అలలు, అనంతమైన జలవనరులు.. ఇంతటి సంపదను మన ఒడ్డుకు చేర్చే సాహసమూర్తులు మత్స్యకారులు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల కష్టం, ధైర్యం, జీవావరణ పరిరక్షణకు వారి కృషి అమోఘం. ఉమ్మడి ADBలో ప్రవహించే గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా నదులతో పాటు వందలాది వాగులు, చెరువుల నుంచి మత్స్యాలు ప్రజలకు ఆహారం, తాగు, సాగనీరు అందుతున్నాయి. జలవనరులను అందరూ కాపాడుకోవాలి.
#నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం

News November 21, 2025

OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్‌గా పంత్

image

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్‌గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.