News March 10, 2025

నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన 

image

విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఫార్చ్యూన్ మురళి పార్క్‌లో నేడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. మంటాడ 2 మ్యాన్ హ్యూటన్ అనే పుస్తకాన్ని సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకం నోరి దత్తాత్రేయుడు రచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కూడా అతిథులుగా పాల్గొననున్నారు. 

Similar News

News November 27, 2025

ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

image

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 22 ఫ్లయింగ్ స్క్వాడ్, 6 స్టాటిక్ సర్వేలయన్స్, 6 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను, 4 అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.

News November 27, 2025

మంచిర్యాల జిల్లాలో 25 నామినేషన్లు దాఖలు

image

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు గురువారం మంచిర్యాల జిల్లాలో 90 సర్పంచ్ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. 816 వార్డులకు గాను 14 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. మరో రెండు రోజులు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా.. ఈ నెల 30న పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.

News November 27, 2025

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 26 నామినేషన్లు

image

మొదటి రోజు నిర్మల్ జిల్లాలో మొత్తం 26 నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. దస్తురాబాద్‌ 3, కడెం (పెద్దూర్‌) 9, ఖానాపూర్‌ 7, మామడ 6, లక్ష్మణచాందా 1 నామినేషన్లు దాఖలయ్యాయి. పెంబిలో నామినేషన్ దాఖలు కాలేదన్నారు. నామినేషన్ల స్వీకరణ 29 వరకు కొనసాగుతుందని వివరించారు.