News March 10, 2025
నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఫార్చ్యూన్ మురళి పార్క్లో నేడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. మంటాడ 2 మ్యాన్ హ్యూటన్ అనే పుస్తకాన్ని సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకం నోరి దత్తాత్రేయుడు రచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కూడా అతిథులుగా పాల్గొననున్నారు.
Similar News
News October 23, 2025
NLG: ఇక ఆ స్కూళ్లల్లో బాలికలకు కరాటే శిక్షణ!

బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది NOV నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు KGBV, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా జిల్లాలో 36 పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు. బాలికలకు కరాటే జూడో, కుంగ్ ఫూ నేర్పిస్తారు.
News October 23, 2025
నిరాశలో రైతులు.. ఇదీ ఎనుమాముల మార్కెట్ పరిస్థితి!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలో రెండో అతిపెద్దది. మూడేళ్లుగా పాలకవర్గం ఖాళీ, మద్దతు ధరలు లేనివల్ల రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. పత్తి సీజన్ ప్రారంభమైనప్పటికీ మార్కెట్ సౌకర్యాలు తగ్గి, ధరలు తక్కువగా ఉండటం రైతుల్లో అసహనాన్ని కలిగించిందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
News October 23, 2025
భారీ వర్షాలు.. గుంటూరు జిల్లాలో స్కూళ్లకు హాలిడే

గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో సీవీ రేణుక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అయోమయంలో పడ్డారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.