News February 12, 2025

నేడు వినుకొండకు రానున్న కలెక్టర్ అరుణ్ బాబు

image

వినుకొండలో త్వరలో ఏర్పాటు చేయబోయే లెదర్ పార్క్ స్థల పరిశీలనకు పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు బుధవారం ఉదయం 10:00 గంటలకు వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మల్టీ నేషనల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గ ప్రజలు గమనించగలరు.

Similar News

News December 9, 2025

కరీంనగర్ ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

image

ఆర్టీసీ కరీంనగర్-1 డిపో ప్రత్యేక వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డి.ఎం. విజయమాధురి తెలిపారు. ఈ ప్యాకేజీలో బీదర్ జలా నరసింహస్వామి, బీదర్ పోర్టు, జరాసంగం, రేజింతల్ సందర్శన ఉంటుంది. ఈ నెల 14న ఉదయం 3:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్‌కు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించారు. ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.

News December 9, 2025

మెదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సా. 5 గంటల నుంచి ప్రచారానికి తెరపడనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 9, 2025

గ్రామ పోరుకు సిద్ధం.. ‘నల్గొండలో ఏర్పాట్లు పూర్తి’

image

జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని దృష్టికి తీసుకెళ్లారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్‌ వివరాలను నిర్ణీత సమయాల్లో ‘టీ-పోల్‌’లో నమోదు చేయాలని ఈసీ ఆదేశించారు.