News October 21, 2024
నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం విశాఖ రానున్నారు. ఉదయం 9.30గంటలకు విమానాశ్రయానికి చేరుకుని, ఇక్కడి నుంచి 9.35 గంటలకు రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి సాయంత్రం 4.10గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి 4.15గంటల విమానంలో విజయవాడ బయలుదేరి వెళతారు.
Similar News
News December 19, 2025
బురుజుపేట: కనకమహాలక్ష్మి అమ్మవారికి సారె సమర్పణ

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో అఖరి రోజు కావడంతో శుక్రవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో శోభారాణి అని ఏర్పాట్లు చేశారు. ఆలయావరణంలో ప్రత్యేక ప్రసాదం కౌంటర్లను అందుబాటులో ఉంచారు.
News December 19, 2025
విశాఖలో కిలో బీన్స్ పిక్కలు రూ.125

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.28, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.42, బెండ రూ.54, మిర్చి రూ.44, బీరకాయ రూ.62, కాలిఫ్లవర్ రూ.26, కాకరకాయ రూ.60, చిలకడ దుంప రూ.34, దొండకాయ రూ.42, క్యారెట్ రూ.38, చిక్కుడుకాయ రూ.60, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.50, బీన్స్ పిక్కలు రూ. 125, పొటల్స్ రూ.54, క్యాప్సికం రూ.44గా ఉన్నాయి.
News December 19, 2025
విశాఖలో పర్యటించనున్న రక్షణ రంగ కమిటీ

రక్షణ రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు కొచ్చి, బెంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్, వారణాసి నగరాల్లో అధ్యయన పర్యటన చేపట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని NSTL ప్రతినిధులతో DRDO ప్రాజెక్టుల అప్గ్రేడేషన్పై, అదేవిధంగా కోస్ట్ గార్డ్ ప్రతినిధులతో తీరప్రాంత భద్రత, రక్షణ సన్నద్ధతపై కమిటీ సభ్యులు కీలక చర్చలు జరపనున్నారు.


