News January 15, 2025
నేడు వేములపల్లికి ఎమ్మెల్యే

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం వేములపల్లి మండల కేంద్రంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమనగల్లు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో అభివృద్ధి పోస్టర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News February 18, 2025
నేడు పెద్దగట్టు జాతరలో చంద్రపట్నం

పెద్దగట్టు జాతరలో నేడు మూడోరోజు చంద్రపట్నం వేసి స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు దేవాలయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
News February 18, 2025
నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
News February 18, 2025
నర్సరీల పెంపకం వేగవంతం చేయాలి: కలెక్టర్ త్రిపాఠి

రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు ,ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంసిఓలతో వివిధ అంశాలపై సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ముందుగా బ్యాగులలో మట్టి నింపడాన్ని పూర్తిచేయాలని, షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.