News November 22, 2024

నేడు శిల్పారామానికి రాష్ట్రపతి

image

నేడు హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో మేధోమథన సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Similar News

News December 2, 2025

హైదరాబాద్‌లో తొలి IFAS టెక్నాలజీ!

image

HYDలో తొలిసారిగా అధునాతన IFAS (ఇంటిగ్రేటెడ్ ఫిక్స్‌డ్-ఫిల్మ్ యాక్టివేటెడ్ స్లడ్జ్) టెక్నాలజీతో కూడిన మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) రానుంది. HMDA ఆధ్వర్యంలో తొర్రూర్ లేఅవుట్‌లో రూ.5.90కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. 2.3 MLD సామర్థ్యం గల ఈ ప్లాంట్ కేవలం 0.43 ఎకరాల పరిమిత స్థలంలోనే నైట్రోజన్, ఫాస్ఫరస్‌లను సమర్థవంతంగా తొలగించనుంది. ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది.

News December 2, 2025

HYD: Privacy ఒక్కటే ప్రశ్నార్థకం?

image

లక్షలాది మంది ‘క్రెడిట్-ఇన్విజిబుల్’ కుటుంబాలకు రుణాలిచ్చేందుకు TIB ఏర్పాటు ప్రతిపాదనలు గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. TGDeX ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేసే TIB డేటా గోప్యతకు కట్టుబడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వనుందని అధికారుల మాట. అయితే, ఈ లాభాపేక్షలేని ప్రభుత్వ సంస్థ పనితీరుపై కొందరు ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేయడం గమనార్హం. Privacy మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

News December 2, 2025

HYD: Privacy ఒక్కటే ప్రశ్నార్థకం?

image

లక్షలాది మంది ‘క్రెడిట్-ఇన్విజిబుల్’ కుటుంబాలకు రుణాలిచ్చేందుకు TIB ఏర్పాటు ప్రతిపాదనలు గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. TGDeX ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేసే TIB డేటా గోప్యతకు కట్టుబడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వనుందని అధికారుల మాట. అయితే, ఈ లాభాపేక్షలేని ప్రభుత్వ సంస్థ పనితీరుపై కొందరు ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేయడం గమనార్హం. Privacy మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.