News November 23, 2024

నేడు శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశం

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఉదయం నిర్వహించనున్నట్లు CEO ఎల్.ఎన్.వి శ్రీధర్ రాజా ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని స్పష్టం చేశారు.

Similar News

News November 15, 2025

కోటబొమ్మాళి: భర్తకు అంత్యక్రియలు జరిపిన భార్య

image

కోటబొమ్మాళి మండలం జర్జంగి పంచాయతీలో గల గుంజులోవ గ్రామంలో విషాద ఘటన కలిచివేసింది. గ్రామానికి చెందిన తిర్లంగి లక్ష్మణరావు(40) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయనకు పదేళ్లు కూడా నిండని ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో భార్య తీర్లంగి రోహిణి భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ విషాద దృశ్యం అక్కడి వారి కంట కన్నీరు తెప్పించింది.

News November 14, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➤జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
➤ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
➤ కొత్తమ్మతల్లి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం
➤టెక్కలిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
➤SKLM: గ్రంథాలయాలు పాఠకులకు నేస్తాలు
➤మందసలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు
➤నరసన్నపేట: నో స్మోకింగ్ జోన్‌లుగా పాఠశాల ప్రాంగణాలు

News November 14, 2025

SKLM: ‘బాలలు చెడి వ్యసనాలకు బానిస కావద్దు’

image

బాలలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ఆడిటోరియంలో బాలలదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యను చక్కగా అభ్యసించి దేశానికి ఉపయోగపడే భావిపౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత ఆశయాలతో మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. DSP వివేకానంద, ప్రిన్సిపల్ కృష్ణవేణి, అధికారులు ఉన్నారు.