News February 10, 2025

నేడు శ్రీశైలానికి మంత్రుల బృందం

image

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రుల బృందం క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.

Similar News

News October 28, 2025

KMM: వామ్మో.. 5 కోట్ల సంవత్సరాల దారుశిలాజం హా?

image

మధిర రైల్వే స్టేషన్‌ రామాలయం పునర్నిర్మాణ పనుల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో లభించిన ఓ పురాతన రాయిని పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. అది సుమారు 5 కోట్ల సంవత్సరాల వయసు గల దారుశిలాజంగా గుర్తించారు. విస్తృత పరిశోధన కోసం శిలను HYD ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ఇంతటి చరిత్ర కలిగిన రాయి దొరకడంపై ఆలయ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

News October 28, 2025

రాయపట్నంలో సబ్‌స్టేషన్‌కు Dy.CM భట్టి శంకుస్థాపన

image

మధిర మండలం రాయపట్నం గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, వోల్టేజీ సమస్యల పరిష్కారం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవలు అందించడానికి ఈ ఉపకేంద్రం దోహదపడుతుందని తెలిపారు.

News October 28, 2025

వనపర్తి: పేదల కడుపు నింపండి.. రూ.5 భోజనం పెట్టండి

image

వనపర్తి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తరహాలో రూ.5కే భోజనం అందించే పథకాన్ని అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కొత్త బస్టాండ్, గాంధీచౌక్, అంబేడ్కర్ చౌరస్తా, కలెక్టర్ కార్యాలయం వంటి ఆరు ప్రాంతాల్లో భోజన కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చడానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు.