News February 10, 2025

నేడు శ్రీశైలానికి మంత్రుల బృందం

image

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రుల బృందం క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.

Similar News

News February 8, 2026

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలై లామా పేరు!

image

లైంగిక నేరగాడు <<19009352>>ఎప్‌స్టీన్ ఫైల్స్‌<<>>లో టిబెట్ మత గురువు దలై లామా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా 169 సార్లు ప్రస్తావించినట్లు రిపోర్టులు రావడంతో ఆయన ఆఫీసు స్పందించింది. ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో దలై లామాను లింక్ చేయాలని కొన్ని మీడియా సంస్థలు, SM హ్యాండిల్స్ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎప్‌స్టీన్‌ను ఆయన ఎన్నడూ కలవలేదు. సమావేశం కాలేదు. అతడితో మాట్లాడలేదు’ అని స్పష్టంచేసింది.

News February 8, 2026

MDK: రేపే ప్రచారానికి ఆఖరు

image

మున్సిపల్ ఎన్నికల పోరు కీలక ఘట్టానికి చేరింది. రేపు ప్రచారానికి ఆఖరు కావడంతో సమయం లేక అభ్యర్థులు ఆగమాగం అవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీల ప్రచారం తీరు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం అందరి మాటలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 409 వార్డులకు1,486 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

News February 8, 2026

హాస్టళ్లకు సమస్యల గ్రహణం.. ఇప్పుడన్న వీడేనా.?

image

జిల్లాలో మొత్తం 113 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. పలు హాస్టల్స్‌లో సమస్యలు తిష్ట వేశాయి. వీటిని నెట్ జీరో ప్రాంగణాలుగా తీర్చిదిద్దేలా కలెక్టర్ ఇటీవల సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్‌లో ఆర్ఓ ప్లాంట్, టాయిలెట్స్, విద్యుత్, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలని సూచించారు. ఇందుకోసం నివేదికలు అందజేయాలని సూచించారు. ఇకనైనా సమస్యలు పరిష్కారం అవుతాయేమోనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.