News February 25, 2026

నేడు శ్రీ రంగనాథుడి బ్రహ్మోత్సవాలు.. 25 రాత్రి అంకురార్పణ..!

image

శ్రీ రంగనాథుడి బ్రహ్మోత్సవాలకు నేడు రాత్రి అంకురార్పణ జరగనుంది. 26ధ్వజారోహణం, 27సూర్యప్రభ వాహనం, 28శేష వాహనం, మార్చి 1న హనుమద్వాహన సేవ, మంటపోత్సవం, 2న మోహిని అలంకరణ సేవ, రాత్రి 8గంటలకు గరుడసేవ, 10గంటలకు కళ్యాణోత్సవం, 3న శ్రీవారి సేవ, గజవాహన సేవ, 4న ఉ. రా.10గంటలకు రథోత్సవం 5న అశ్వవాహన సేవ అరుణ చక్రస్నానం పూర్ణాహుతి ద్వజారోహణం శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన క్రతువులను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు.

Similar News

News April 19, 2026

మెదక్ ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్

image

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా 2022 బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ నియమితులయ్యారు. ప్రస్తుతం భద్రాచలంలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన మహేందర్ గత నెల 31న రిటైర్ కావడంతో ఆ స్థానంలో విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 19, 2026

ప.గో: హాట్ టాపిక్‌.. అసలు సూత్రధారులు ఎవరు?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారుచేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఇప్పటికే ఈ వ్యవహారం జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

News April 19, 2026

AP రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

image

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్‌లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.