News January 3, 2025

నేడు సంగారెడ్డిలో మంత్రి పర్యటన

image

సంగారెడ్డిలో నేడు మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో అమృత్ 2.0 కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, సమాఖ్య పెట్రోల్ పంపుకు శంకుస్థాపన, మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేసి 108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తారు. జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించున్నారు.

Similar News

News January 18, 2025

కంగ్టి: 60 సంవత్సరాలు పూర్తయిన సభ్యులకు సన్మానం

image

కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సమైక్య సమావేశం నిర్వహించారు. డ్వాక్రా గ్రూప్లో 60 సంవత్సరాలు పూర్తయిన మహిళ మాజీ వార్డు సభ్యురాలు కుమ్మరి సత్యవ్వను గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. సీసీలు రేణుక, కల్లప్ప, వివోఏలు సుమ, సవిత, వివో లీడర్లు మహిళ సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

News January 18, 2025

సంగారెడ్డి: గర్భం దాల్చిన బాలిక

image

మతిస్థిమితం లేని బాలిక గర్భం దాల్చిన ఘటన హత్నూర(M)లో అలస్యంగా వెలుగులోని వచ్చింది. స్థానికుల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదివి ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు కూలీ పనుల కోసం వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. 7 నెలల గర్భవతి కావడంతో విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కేసు నమోదు కాలేదు.

News January 18, 2025

సిద్దిపేట: ఉద్యోగం సాధించిన యువతి

image

సిద్దిపేట జిల్లా చేర్యాలకి చెందిన తుమ్మలపల్లి కనకయ్య, కవితల కుమార్తె నవ్య ENCO AE ఫలితాలలో ఉద్యోగం సాధించారు. బీటెక్ JNTU మంథని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత HYDలో ఉంటూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించారు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆమెను అభినందించారు.