News March 30, 2025

నేడు సన్నబియ్యం పథకం ప్రారంభం.. ఫస్ట్ వీరికే!

image

రాష్ట్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్‌నగర్‌ వేదికగా CM రేవంత్ ప్రారంభించనున్నారు. మొదటగా పట్టణంలోని రేషన్ కార్డుదారులు ధరావత్ బుజ్జీ, కర్ల రాధ, పైలా రజిత, సుశీల, షేక్ కరీమా, మమత, చల్లా సుగుణ, కర్నా వెంకటపుష్ప, సరికొండ ఉమ, మండల పరిధిలోని చడపండు లక్ష్మి, భరతం కుమారి, కర్పూరపు లక్ష్మి, మాళోతు రంగా, గుండెబోయిన గురవయ్య, షేక్ రహిమాన్‌కు CM రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.

Similar News

News November 27, 2025

MHBD: ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తాం: SP

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ డా.శబరిష్ తెలిపారు.MHBD జిల్లా పరిధిలో జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ దశను పూర్తిగా శాంతియుతంగా,నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేస్తూ నామినేషన్ల సమయంలో ఎలాంటి అశాంతి,అవకతవకలు జరగకుండా పోలీస్ అధికారులు,సిబ్బంది హైఅలర్ట్ ఉన్నారన్నారు.

News November 27, 2025

ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 27, 2025

VKB: ‘ఎన్నికల విధుల్లో సక్రమంగా విధులు నిర్వహించాలి’

image

గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తు ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు షేక్ యాస్మిన్ భాష అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో ఎన్నికల నిర్వహణపై పరిశీలకురాలు కలెక్టర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దన్నారు.