News March 30, 2025

నేడు సన్నబియ్యం పథకం ప్రారంభం.. ఫస్ట్ వీరికే!

image

రాష్ట్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్‌నగర్‌ వేదికగా CM రేవంత్ ప్రారంభించనున్నారు. మొదటగా పట్టణంలోని రేషన్ కార్డుదారులు ధరావత్ బుజ్జీ, కర్ల రాధ, పైలా రజిత, సుశీల, షేక్ కరీమా, మమత, చల్లా సుగుణ, కర్నా వెంకటపుష్ప, సరికొండ ఉమ, మండల పరిధిలోని చడపండు లక్ష్మి, భరతం కుమారి, కర్పూరపు లక్ష్మి, మాళోతు రంగా, గుండెబోయిన గురవయ్య, షేక్ రహిమాన్‌కు CM రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.

Similar News

News November 16, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఎర్ర చందనం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు డ్రోన్లతో పహారా కాస్తున్నట్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు DSP మహేంద్ర తెలిపారు. మరో 8 మంది నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
* గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు ఐదేళ్ల తర్వాత విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

News November 16, 2025

HYD: కల్తీ టీ పొడి ఇలా గుర్తించండి!

image

నగరంలో కల్తీ టీ పొడిని గుర్తించలేని పరిస్థితి. అలాంటి సమయంలో నీళ్లలో ఒక దుకాణంలో తెచ్చిన టీ పొడి, మరో దుకాణంలో తెచ్చిన టీ పొడిని ఒక గ్లాసులో వేయండి. రంగు తేడా వచ్చిందా..? వెంటనే 040-21111111 ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి దైవ నిధి తెలిపారు. ప్రజలు కల్తీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News November 16, 2025

మరో అల్పపీడనం.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఈనెల 17, 18 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.