News September 4, 2024
నేడు సికింద్రాబాద్కు వన్ వే స్పెషల్

వరదలు కారణంగా ఆయా స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి సికింద్రాబాద్కు వన్ వే ఏపీ స్పెషల్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్ వన్ వే ఏపీ స్పెషల్ ఎక్స్ప్రెస్ బుధవారం రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.
Similar News
News December 19, 2025
VZM: రైతుల ఖాతాల్లో రూ.373 కోట్ల జమ

ఖరీఫ్ 2025-26లో జిల్లాలో 359 RSKల ద్వారా 37,800 రైతుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.373 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా మేనేజర్ బి.శాంతి శుక్రవారం తెలిపారు. అదనపు కిలోలు డిమాండ్ చేసిన పలు రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేసి, తూకంలో మోసాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు.
News December 19, 2025
జిల్లాలో 1.99 లక్షల మంది చిన్నారులే లక్ష్యం: VZM DMHO

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.జీవినరాణి తెలిపారు. స్థానిక కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. 1180 బూతులు, 2360 బృందాలు ఏర్పాటు చేయగా, 2,45,667 OPV డోసులు సిద్ధంగా ఉంచామన్నారు.
News December 19, 2025
VZM: కలెక్టర్కు సీఎం చంద్రబాబు అభినందనలు

నైపుణ్య శిక్షణ, గృహనిర్మాణం, మున్సిపల్ సేవల్లో మెరుగైన పనితీరుతో విజయనగరం జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. IVRS సర్వేలో 69.14% సానుకూల స్పందన లభించింది. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రంలో 3వ స్థానం, పీఎంఏవై గృహనిర్మాణంలో 4వ స్థానం సాధించింది. PGRSలో ఫిర్యాదులకు సానుకూల అభిప్రాయం వచ్చింది.


