News January 26, 2025

నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు..

image

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలో ఉ.7:30 నుంచి ఉ.11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు రాజ్‌భవన్‌‌లో ఎట్‌ హోం కార్యక్రమం ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.

Similar News

News September 18, 2025

HYD: వైద్య సేవల బలోపేతంపై మంత్రి సమీక్ష

image

ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రులలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర రాజనరసింహ ఎస్ఆర్ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పర్యటించి 2, 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని TGMSIDC ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

News September 18, 2025

చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

image

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.

News September 18, 2025

BREAKING.. HYDలో భారీ ట్రాఫిక్.. 5KMల వరకు నరకం..!

image

HYDలో కొద్ది గంటలుగా కురుస్తోన్న వర్షంతో నగరంలో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో అమీర్‌పేట్- బేగంపేట్, సికింద్రాబాద్, సోమాజీగూడ- బేగంపేట్, సికింద్రాబాద్‌‌‌‌కు వెళ్లే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో దాదాపు 5 KMల వరకు ట్రాఫిక్ స్తంభించినట్లు తెలుస్తోంది. కాగా, ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులెవరూ ఇంకా రంగంలోకి దిగకపోవడం గమనార్హం.