News March 13, 2025

నేడు సిరిసిల్ల కలెక్టరేట్‌లో జాబ్ మేళా

image

సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీ వైఎస్‌కే ఇన్ఫోటెక్‌లో ఉద్యోగాలు కల్పించడానికి నేడు కలెక్టరేట్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి నీల రాఘవేంద్ర తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నేడు ఉదయం 11 గంటలకు సంబంధిత పత్రాలు జిరాక్సులతో హాజరవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు 70935 14418, 90003 85863 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 26, 2025

MDK: పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు

image

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీపీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అర్ధబలం, ప్రజల్లో పేరు ప్రతిష్టలు వున్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ పల్లెల్లో పట్టు నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకం. MDKలో 492, SRDలో 613, SDPTలో 508 జీపీలు ఉన్నాయి.

News November 26, 2025

సిద్దిపేట: రేపు దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు

image

రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఉద్దేశించి దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద తెలిపారు. ఈ ఆటల పోటీలను డిగ్రీ కళాశాల పక్కన ఉన్న క్రీడా స్టేడియంలో జరుపబడతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. గెలుపొందిన మొదటి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.

News November 26, 2025

భీమవరంలో మెప్మా జాబ్ మేళా ప్రారంభం

image

మెప్మా సంస్థ ఆధ్వర్యంలో, నిపుణ సహకారంతో భీమవరం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని, ఇలాంటి అవకాశాలు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అన్నారు.