News March 13, 2025
నేడు సిరిసిల్ల కలెక్టరేట్లో జాబ్ మేళా

సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీ వైఎస్కే ఇన్ఫోటెక్లో ఉద్యోగాలు కల్పించడానికి నేడు కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి నీల రాఘవేంద్ర తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నేడు ఉదయం 11 గంటలకు సంబంధిత పత్రాలు జిరాక్సులతో హాజరవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు 70935 14418, 90003 85863 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 14, 2026
కోదాడలో కల్తీ వంటనూనె కలకలం

కోదాడ పట్టణంలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపారు. కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రజలు ఆహార కల్తీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News March 14, 2026
రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

భారత్లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్లో నిలిచాయి.
News March 14, 2026
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం 45 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 4,156 మంది బాలురు, 4001 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు అరగంట ముందే చేరుకోవాలన్నారు.కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ దుకాణాలు మూసివేయనున్నారు.


