News August 19, 2024
నేడు సీఎం చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటన వివరాలు

సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీసిటీకి వెళ్లతారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్లో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News November 6, 2025
కలగానే..ఉదయగిరి రెవెన్యూ డివిజన్!

నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్దండులకు పేరుగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కలగా మారుతోంది. ఇక్కడున్న 8 మండలాల్లో నాలుగింటిని కావలిలో కలిపేలా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదన ఉండడంతో ఆ ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు గూడూరును నెల్లూరుజిల్లాలో కలిపేందుకు మంత్రి వర్గ ఉపసంఘం సానుకూలతను కల్పించడం కొంత మేరా ఆశాజనకంగా మారుతుంది. అయితే దీనిపై గెజిట్ వచ్చే వరకు వేచి చూడకు తప్పదు.
News November 6, 2025
లోకేష్ పర్యటనలో టోల్ గేట్ వరకే పరిమితమైన కావలి MLA !

మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గ పర్యటనలో MLA కృష్ణారెడ్డి పాత్ర కేవలం ముసునూరు టోల్ గేట్ వరకు మాత్రమే పరిమితమైంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ వెంట MLA దగదర్తికి వెళ్లలేదు. MLA కావ్యకు టీడీపీ నేత మాలేపాటికి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. కావ్య రాకను మాలేపాటి అనుచరులు, అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఆయన టోల్ గేట్ వరకే పరిమితమయ్యారని సమాచారం.
News November 6, 2025
మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.


