News April 30, 2024

నేడు సీఎం జగన్ కడప జిల్లా పర్యటన వివరాలు

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మైదుకూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. ఉ. 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.45కు ప్రకాశం జిల్లా టంగుటూరు చేరుకొని బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి 12.45కి మైదుకూరుకు హెలికాప్టర్లో రానున్నారు. 12.55గం.కు సభాస్థలికి చేరుకుని 1.10-1.55 గంటల వరకు కొనసాగించనున్నారు. 2.10గం.కు అన్నమయ్య జిల్లాకు బయలుదేరుతారు.

Similar News

News December 18, 2025

కడప జిల్లాలో లక్ష్యానికి దూరంగా AMCల రాబడి

image

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి 2025-26లో రూ.13.53 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి రూ.7.09 కోట్లు (52.44%) మాత్రమే వసూలైంది (రూ.కోట్లలో). కడప – 1.54, ప్రొద్దుటూరు – 0.71, బద్వేల్ – 1.20, జమ్మలమడుగు – 0.42, పులివెందుల – 0.67, మైదుకూరు – 1.44, కమలాపురం – 0.44, సిద్దవటం – 0.13, ఎర్రగుంట్ల – 0.38, సింహాద్రిపురం – 0.12 మాత్రమే వసూలైంది.

News December 17, 2025

ఖాజీపేట: కానిస్టేబుల్‌ జాబ్ కొట్టిన హోమ్ గార్డు కుమారుడు

image

ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తున్న ప్రసాద్ కుమారుడు పవన్ కళ్యాణ్ పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ వంశీధర్ పవన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ యూనిఫామ్ అందజేశారు. విధి నిర్వహణలో ప్రజలకు మంచి సేవలు అందించి ఉన్నతంగా రాణించాలని సూచించారు.

News December 17, 2025

కడప: శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్ అందజేత

image

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మన కడప జిల్లా మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత చెక్కును మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉండవల్లిలో బుధవారం ఆమె అందుకున్నారు. కడపలో ఇంటి స్థలం, గ్రేడ్ వన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఆమెకు ఇవ్వనున్న విషయం తెలిసిందే.