News December 26, 2024

నేడు HYD నుంచి కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

image

హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో బెలగావికి సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరనున్నారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బెలగావిలో సీడబ్ల్యూసీ 26, 27వ తేదీల్లో ఈ ప్రత్యేక సమావేశాలను గ్రాండ్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తునారు. ఈ సమావేశంలో సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర సీనియర్ నేతలు కలిపి 200 మంది కీలక నేతలు పాల్గొంటారు.

Similar News

News January 16, 2025

సికింద్రాబాద్‌లో ముగిసిన కైట్ ఫెస్టివల్

image

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ బుధవారంతో ముగిసింది. 50 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సూపర్ హీరోలతో పాటు భారీ ఆకారంలో స్నేక్, గాడ్జిల్లా, వివిధ రకాల బొమ్మలు, హైదరాబాద్ మెట్రో సంస్థ(L&T)కు చెందిన ట్రైయిన్ కైట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది పరేడ్‌ గ్రౌండ్‌లో సంక్రాంతి సందర్భంగా ఎంజాయ్ చేశారు.

News January 15, 2025

జార్జ్ రెడ్డి: ఈ పేరు HYDలో యాదుంటది!

image

‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి పేరు ఎప్పటికీ యాదుంటది. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1947, JAN 15న జార్జ్ జన్మించారు. 1962‌‌లో ఆయన ఫ్యామిలీ HYDలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్ OUలో పీజీ చేశారు. వర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే హత్యచేశారు. నేడు జార్జ్ జయంతి.

News January 15, 2025

HYD: పోరాట యోధుడి జయంతి నేడు

image

1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్‌ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.