News March 3, 2025

నేడే ఓట్ల లెక్కింపు.. ఏయూలో ఆంక్షలు..!

image

టీచర్స్ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు AUలో ఈరోజు ఉ.8 గంటలకు ప్రారంభం కానుందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. లెక్కింపు సందర్భంగా ఏయూ పరిసర ప్రాంతాలలో ఉ.6 నుంచి కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుంపుగా తిరుగుట నిషేధమన్నారు. మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు మద్యం షాపులు బంద్ కాగా.. గెలిచిన అభ్యర్థులకు విజయోత్సవ ర్యాలీలు అనుమతి లేదన్నారు.

Similar News

News November 21, 2025

వేములవాడ: ఒంటిపై గాయాలతో యువకుడి వీరంగం

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సాయి అనే యువకుడు ఒంటిపై గాయాలతో వీరంగం సృష్టించాడు. చొక్కా లేకుండా రక్తం కారుతున్నా అటు, ఇటు తిరుగుతూ హల్‌చల్ చేశాడు. సదరు యువకుడి చేష్టలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. భార్య కాపురానికి రావడం లేదనే సాయి ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది.

News November 21, 2025

కామారెడ్డి: నిఖత్ జరీన్‌కు కవిత అభినందనలు

image

మహిళల 51 కేజీల ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నిఖత్ జరీన్‌కు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అభినందనలు తెలిపారు. మీ అచంచలమైన అంకితభావం ప్రతి విజయంలోనూ ప్రతిఫలించింది. ఈ ఘన విజయం భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు అపారమైన గర్వకారణం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’ వేదికగా ఆమె ట్వీట్ చేశారు.

News November 21, 2025

వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు

image

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, వైద్యులు, రెవెన్యూ, పోలీస్ అధికారులను బెదిరించడం, దాడి చేయడం వంటి చర్యలపై వరంగల్ పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రజా సేవల్లో ఉన్న అధికారుల పనిలో జోక్యం చేసుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశారు.