News April 11, 2025
నేడే డయల్ యువర్ డీఎంలో పాల్గొనండి: జనగామ డీఎం

జనగామ ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం ఉ.10 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నామని డీఎం స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ సమస్యలతో పాటు సూచనలు సలహాలకు 9959226050 నెంబర్ను సంప్రదించాలని కోరారు.
Similar News
News January 7, 2026
NTR: Way2News కథనాలకు అధికారుల స్పందన.!

తిరువూరు మెప్మా పరిధిలో రూ.17కోట్ల రుణాల గోల్మాల్పై ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. Way2News కథనాలకు స్పందించిన రాష్ట్ర మెప్మా కార్యాలయం, ఆరుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపింది. బుధవారం తిరువూరు మెప్మా కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసిన బృందం.. డ్వాక్రా మహిళల పేరిట మంజూరైన రుణాలపై ఆరా తీసింది. వివరాల కోసం బ్యాంకులకు లేఖలు రాశామని, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
News January 7, 2026
జిల్లాలో 46 రైల్వే వంతెనలకు లైన్ క్లియర్: జేసీ రాహుల్

జిల్లాలో ప్రతిపాదించిన 50 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల పనుల్లో పురోగతి లభించింది. ఇందులో 46 నిర్మాణాలకు మంజూరు లభించినట్లు జేసీ రాహుల్ వెల్లడించారు. బుధవారం భీమవరంలో తన ఛాంబర్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వీటి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైల్వే సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా 30 మీటర్ల పరిధిలో త్వరితగతిన కొలతలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News January 7, 2026
ఎకో టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలి: కడియం

దేవునూరు గుట్టలు, ధర్మసాగర్ రిజర్వాయర్ను కలిపి ఎకో టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని MLA కడియం శ్రీహరి కోరారు. హనుమకొండ రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడారు. దేవునూరు గుట్టలను అనుకోని ఉన్న గ్రామాల రైతులు ఫారెస్ట్ అధికారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించాలన్నారు.


