News April 9, 2025

నేడే పేట జిల్లా బీజేపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

image

నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కె. సత్య యాదవ్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రానున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు మెట్రో గార్డెన్‌లో ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Similar News

News November 23, 2025

‘పీస్ ప్లాన్’ ఫైనల్ ఆఫర్ కాదు: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏదో ఒక విధంగా ముగించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైన సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వార్ జరిగేది కాదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు తాము ప్రతిపాదించిన 28 పేజీల <<18355334>>పీస్ ప్లాన్<<>> ఫైనల్ ఆఫర్ కాదని స్పష్టం చేశారు. కాగా US ప్రతిపాదించిన ప్లాన్ రష్యాకు మేలు చేసేలా, ఆ దేశం అడిగినవన్నీ జరిగేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News November 23, 2025

కల్కి ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు?

image

విష్ణువు ‘కల్కి’ అవతారంలో కలియుగం చివరిలో అవతరిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో ఇప్పటికే దాదాపు 5 వేల సంవత్సరాలు పూర్తయ్యాయి. కల్కి అవతారం సుమారు 4,27,000 సంవత్సరాల తర్వాత వస్తాడని కొందరు నమ్ముతారు. UPలోని శంభల గ్రామంలో జన్మిస్తాడని భవిష్యవాణిలో ఉంది. ధర్మ సంస్థాపన కోసం తన ఖడ్గంతో అందరికీ సమాధానం చెబుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

News November 23, 2025

ఖమ్మం: ఓయూ చరిత్రలో తొలి ఆదివాసి పరిశోధకుడు

image

ఏన్కూరు మండలం కేసుపల్లికి చెందిన సాగబోయిన పాపారావు తొలి ఆదివాసి పరిశోధక విద్యార్థిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఓయూ సోషియాలజీ విభాగం నుంచి ఆయన ఈ గుర్తింపు పొందారు. ప్రొఫెసర్ పి. విష్ణుదేవ్ పర్యవేక్షణలో ‘ఐటీడీఏ భద్రాచలం గిరిజన అభివృద్ధిపై సామాజిక అధ్యయనం’ అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. ఓయూ కంట్రోలర్ ఆయన్ను తొలి ఆదివాసి పరిశోధకుడిగా ప్రకటించారు.