News March 19, 2025
నేడే బడ్జెట్.. కొత్తగూడెం జిల్లాకూ కావాలి నిధులు..!

నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పెండింగ్లో ఉన్న భద్రాద్రి రామయ్య కేత్రం అభివృద్ధి, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, పులుసుబొంత వాగు ప్రాజెక్టు, కొత్తగూడెం బైపాస్ రహదారి, పలు కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం నుంచే ముగ్గురు మంత్రులు ఉండటంతో నిధులు భారీగా కేటాయించాలని కోరుతున్నారు.
Similar News
News October 16, 2025
నాడు సంతకాలు చేసిన వారే నేడు ఉన్నారు.!

తిరుమల శ్రీవారి పరకాణి విషయంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రవికుమార్ బోర్డు సమావేశం తరువాత అనుమతి పత్రం ఇస్తే ముందే తీర్మానం చేశారని టీటీడీ బోర్డు సభ్యులు ఆరోపించారు. అయితే ఆ బోర్డులో సంతకాలు చేసిన పలువురు సభ్యులు నేటి బోర్డులో సంతకాలు చేయడం విశేషం. మరి వారిది తప్పు కదా.? వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని భక్తులు చర్చించుకుంటున్నారు.
News October 16, 2025
474 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

UPSC 474 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా/ఇంజినీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), MSc చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200, మహిళలు, SC,ST, PwBDలకు మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://upsconline.nic.in/
News October 16, 2025
కరీంనగర్: ‘బియ్యం బుక్కేస్తున్నారు’..!

ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి సర్కార్కు అప్పజెప్పే క్రమంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిన్న శంకరపట్నం తాడికల్లోని రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా రూ.6.73 కోట్ల 31,234 క్వింటాళ్ల CMR స్టాక్ దారి మళ్లినట్లు గుర్తించారు. PDPL 140, KNRలోని 111 రైస్ మిల్లులకు CMRకు ప్రభుత్వం ధాన్యం కేటాయించింది.