News March 19, 2025
నేడే రాష్ట్ర బడ్జెట్..KMR జిల్లా ప్రజల బడ్జెట్పై ఆశలు..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల లేమితో సంవత్సరాల తరబడి ప్రాజెక్టుల పనులు పూర్తికావడం లేదు. శతాబ్దాల చరిత్ర కలిగిన కౌలాస్ కోట మరుగున పడి చరిత్రలో కలిసిపోవడానికి రెడీగా ఉంది. అలాగే కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు నిధుల గండం పడుతోంది. బడ్జెట్లో వీటిపై ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో చూడాలి.
Similar News
News September 17, 2025
వరిధాన్యం రవాణాకు సహకరించండి: DTO

ఖరీఫ్ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు సహకరించాలని లారీ, ట్రాక్టర్ యజమానులకు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సమీప రైతు సహాయక కేంద్రాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సహకరించిన వాహన యజమానులకు రవాణా ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
News September 17, 2025
తెలంగాణ విమోచనంలో ఉమ్మడి KNR జిల్లా యోధులు

TG సాయుధ పోరాటంలో ఉమ్మడిKNR జిల్లా వీరులది కీలకపాత్ర. నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి వీరులగడ్డ కేంద్రంగా నిలిచింది. అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, సింగిరెడ్డి అంజిరెడ్డి, బోయినపల్లి వెంకటరావు, దేశిని చిన్నమల్లయ్య లాంటి ఎందరో యోధులు నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. TG సాయుధ పోరాటం వంటి ఉద్యమాల్లో పాల్గొని నిజాంకు సవాలు విసిరారు.
News September 17, 2025
ఆపరేషన్ పోలో కోదాడ నుంచే ప్రారంభం

ఉమ్మడి నల్గొండ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల ఆగడాలను జిల్లా ప్రజలు ఎదురొడ్డి పోరాడారు. ఈ క్రమంలో నిజాం నవాబు పాలనలో బానిసత్వంలో మగ్గిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలను ఆపరేషన్ పోలో విముక్తుల్ని చేసింది. అయితే యూనియన్ సైన్యం మొదట అడుగుపెట్టింది మాత్రం కోదాడలోనే. అక్కడి నుంచే HYDకు జైత్రయాత్ర సాగించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న నిజాం తలొగ్గారు.