News April 12, 2025
నేడే రిజల్ట్.. అనంతపురం విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవ్వాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 15, 2025
20న పెళ్లి.. ఇష్టం లేక యువతి ఆత్మహత్య

పెళ్లికూతరు కావాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాప్తాడు మండలంలో జరిగింది. పూలకుంట గ్రామానికి చెందిన రేణుక(24) ఆకుతోటపల్లి-1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆమెకు కళ్యాణదుర్గానికి చెందిన యువకుడితో ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో సందడి మొదలవగా యువతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
News April 15, 2025
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి: అనంతపురం కలెక్టర్

విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకంలో రుణాలు, ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్లో ఉన్న డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
News April 15, 2025
అనంత: విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు గ్రేట్

విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. ఫైర్ సర్వీస్ సభ్యులు అగ్ని తీవ్రతను తగ్గించడంలో, కానీ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడంలో మంచి నైపుణ్యత కనబరుస్తారని జడ్జి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.