News March 3, 2025
నేడే MLC ఫలితం.. సర్వత్రా ఉత్కంఠ..!

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విశాఖ AU ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ప్రధానంగా పోటీలో కూటమి బలపరిచిన రఘువర్మ(APTF),PDF తరఫున విజయగౌరి, PRTU తరుఫున శ్రీనివాసులునాయుడు ఉన్నారు. వీరిలో గురువురులు ఎవరికి పట్టం కట్టారో మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
Similar News
News October 25, 2025
సిరిసిల్ల: బెటాలియన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిరిసిల్ల పరిధిలోని సరదాపూర్ బెటాలియన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సురేష్ మాట్లాడుతూ.. సిరిసిల్లలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయుధాలపై అవగాహన కల్పించామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జగదీశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
News October 25, 2025
సిరిసిల్ల: ‘నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలి’

కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేందాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
News October 25, 2025
మన HYDలో రోప్ వే నిర్మాణానికి లైన్ క్లియర్..!

HYDలోని గోల్కొండ నుంచి కుతుబ్షాహి టూంబ్స్ వరకు 1.5 KM మార్గం రోప్ వే నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థకు కన్సల్టెన్సీగా ఎంపిక చేసింది. HMDA ఆధ్వర్యంలో లైన్ క్లియర్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరో 3 నెలల్లో నివేదిక సిద్ధం చేసి, అందజేయనున్నారు. దీని ఆధారంగానే ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరగనుంది.


