News March 3, 2025
నేడే MLC ఫలితం.. సర్వత్రా ఉత్కంఠ..!

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విశాఖ AU ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ప్రధానంగా పోటీలో కూటమి బలపరిచిన రఘువర్మ(APTF),PDF తరఫున విజయగౌరి, PRTU తరుఫున శ్రీనివాసులునాయుడు ఉన్నారు. వీరిలో గురువురులు ఎవరికి పట్టం కట్టారో మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
Similar News
News November 27, 2025
స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

ఆన్లైన్ సైట్స్లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్స్టామార్ట్’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్ కేర్కు పంపి, పూర్తి రీఫండ్ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
News November 27, 2025
కాకినాడ: వారిని చూసి జగన్ నేర్చుకోవాలి.. యనమల

అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీని చూసి ప్రతిపక్షం ఎలా వ్యవహరించాలో జగన్ చూసి నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. చిన్నపిల్లలయినా బహిష్కరణలకు తావు కాకుండా సభలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రస్తావించారన్నారు. ఎప్పటికైనా జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించడం చేయాలని సూచించారు.
News November 27, 2025
SRCL: మహిళల ఓట్లపైనే అందరి ఆశలు..!

GP ఎన్నికల్లో గెలుపు కోసం CONG, BRS మహిళలపైనే ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 170772 మంది పురుషులు, 182559 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11787 అధికంగా ఉన్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, చీరలు, ఫ్రీ RTC ప్రయాణం వంటి పథకాల పేరిట CONG ఓట్లు అడగనుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు రాబట్టాలని BRS చూస్తోంది.


