News March 26, 2025
నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Similar News
News April 22, 2025
వరంగల్: సెకండ్ ఇయర్ లోనూ వారే ముందజ!

వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. మొత్తం 4743మంది పరీక్షలు రాయగా 3292(69.41%) మంది పాసయ్యారు. బాలికలు మొత్తం 2877 మందికి గాను 2263(78%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1866 మంది విద్యార్థులకు గాను 1029మంది(55.14%) ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఒకేషనల్లో బాలికలు 431 మంది విద్యార్థులకు గాను 347(80.51%) మంది.. బాలురు 227 మందికి 70(30.84%) మంది పాసయ్యారు.
News April 22, 2025
UPDATE: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంతమంది పాసంటే?

ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,035 మంది ఉత్తీర్ణులు అయినట్లు DIEO తెలిపారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా 1,223 ఉత్తీర్ణులయ్యారని వివరించారు.
News April 22, 2025
కడప జిల్లా యువతికి 494 మార్క్స్

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కడప జిల్లా యువతి సత్తా చాటింది. ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరుకు చెందిన ఎద్దుల శివారెడ్డి, లక్ష్మీకొండమ్మ కుమార్తె పూజిత ఎంఈసీ చదువుతోంది. 500 మార్కులకు గాను 494 సాధించింది. ఇంగ్లిషులో 78, సంస్కృతంలో 99, మ్యాథ్స్ 1ఏలో 50, 1బీలో 50, ఎకనామిక్స్లో 99, కామర్స్లో 98, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్లో 20 మార్కులతో సత్తా చాటింది. ఆమెను అందరూ అభినందించారు.