News July 20, 2024

నేను ఇంటర్ ఈ కాలేజ్‌లోనే చదివా: కర్నూల్ ఎంపీ

image

టౌన్ మోడల్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఆ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఇదే కళాశాలలో తాను ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశానని గుర్తుచేశారు. కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవసరమైతే ఎంపీ నిధులను కళాశాల అభివృద్ధికి ఖర్చు చేస్తానని ప్రకటించారు.

Similar News

News October 19, 2025

లిక్కర్ షాపుల కోసం రూ.4.5 కోట్లు పెట్టిన కర్నూలు మహిళ

image

కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తెలంగాణలోని 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం ఆమె రూ.4.5 కోట్లు చెల్లించింది. ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఈమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆమెకు ఏపీలోనూ ఎక్కువ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ ఇవ్వనున్నారు.

News October 19, 2025

జిల్లా కలెక్టర్ డా.సిరి హెచ్చరిక.!

image

దీపావళి సందర్భంగా కేటాయించిన ప్రదేశాలలోనే టపాకాయలు విక్రయించాలని, నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాలని శనివారం కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చే సమయంలో ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

News October 19, 2025

దీపావళి సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ వేదిక రద్దు: కలెక్టర్

image

దీపావళి సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ వేదిక రద్దు చేసినట్లు కలెక్టర్ సిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 20 (సోమవారం)న జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం రద్దయిందని తెలిపారు. ఈ విషయం జిల్లా ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.