News February 2, 2025
నేను కొడితే మాములుగా ఉండదు.. : KCR

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ తన ప్రసంగాలతో కాంగ్రెస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇంతకాలం మౌనం పాటించిన కేసీఆర్ మొన్న(శుక్రవారం) ఎర్రవల్లి ఫాంహౌస్లో జరిగిన సభలో స్పందించారు. నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మాములుగా కాదు గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్?
Similar News
News November 10, 2025
JGTL: 3,750 ఎకరాల లక్ష్యంతో ఆయిల్ పాం సాగు

జగిత్యాల జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్యాక్స్ సంఘాలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ సంవత్సరం నిర్దేశించిన 3,750 ఎకరాల లక్ష్యం చేరుకోకపోవడంతో అధికారులు ప్రతి ప్యాక్స్ పరిధిలో 100 ఎకరాల్లో సాగు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ రాజ గౌడ్ అధ్యక్షతన జరిగిన శిక్షణలో అధికారులు రైతులను వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించాలన్నారు. ఈ పంటకు రాయితీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News November 10, 2025
అన్నమయ్య: దత్తత అవగాహన కార్యక్రమం-2025 గోడపత్రికల విడుదల

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో ‘దత్తత అవగాహన కార్యక్రమం-2025’ గోడపత్రికలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు PGRS సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్లో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో దత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కుటుంబ ఆధారిత సంరక్షణ అందించాలాన్నారు.
News November 10, 2025
ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా

ఢిల్లీ <<18252218>>పేలుడు<<>> ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఘటన ఎలా జరిగిందనే కారణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


