News March 30, 2024
నేను లోకల్ వ్యక్తినే: డాక్టర్ పీవీ పార్థసారథి

ఆదోని MLA టికెట్ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పీవీ పార్థసారథికి ఖరారు అయిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో నాయకులు ఆయనను నాన్ లోకల్ అన్న విమర్శకు కౌంటర్ ఇచ్చారు. తాను లోకల్ వ్యక్తినే అని గత 10 ఏళ్లుగా ఇక్కడ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసు అన్నారు. నాయకులు వారి రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న విమర్శలు తన విజయాన్ని ఆపలేవు అన్నారు.
Similar News
News December 17, 2025
ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
News December 17, 2025
ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి: జేసీ

ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అధికారులు అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News December 17, 2025
కర్నూలు ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ‘విజిబుల్ పోలీసింగ్’ను బలోపేతం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నియమాల అమలు చేపడుతున్నారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సమస్యలు ఎదురైతే డయల్ 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలన్నారు.


