News March 26, 2025

నేను BRSలోనే ఉన్నా: గద్వాల MLA

image

తాను BRS MLAగానే ఉన్నానని గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. కొంత మంది కావాలని తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులను అనుసరించి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై FEB 11న PSలో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను BRS సభ్యత్వాన్ని వదులుకోలేదని, పిటిషన్ కొట్టివేయాలని కోరారు. BRSలోనే ఉన్నానని KTRకు చెప్పానన్నారు.

Similar News

News November 28, 2025

శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

image

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.

News November 28, 2025

NLG: దేశంలోనే అతిపెద్ద భూస్కామ్ ఇదే: మాజీ మంత్రి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీదైన భూములను ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినోళ్లకు కట్టబెడుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట MLA జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ మన తెలంగాణలో జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలసీల పేరుతో భారీగా స్కామ్‌లు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

News November 28, 2025

HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

image

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.