News February 18, 2025
నేరడిగొండ: ఒకేరోజు 700మంది రక్తదానం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండలోని తన నివాసం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీగా స్పందన వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు, అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రక్తదానం చేస్తూ ప్రతి ఒక్కరు కేసిఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరంలో 700 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
హీరాపూర్: కోడలిపై అత్త విజయం

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.
News December 11, 2025
ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్ను సర్పంచ్గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.
News December 11, 2025
ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్గా గెలుపొంది ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.


