News March 10, 2025

నేరాలను అదుపు చేసేందుకు సీరియల్ నంబర్లు: పార్వతీపురం SP

image

నేరాలను అదుపు చేసేందుకు పట్టణంలో ఒకే ఆటో ఒకే సంఖ్య విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్. వి మాధవరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటో యూనియన్లు ఎన్ని ఆటోలు ఉన్నాయి, యూనియన్లు, డ్రైవర్లు, ఆటోలకు సంబంధించిన రికార్డులన్నీ సమీప పోలీస్ స్టేషన్లలో నమోదు చేయించిన తెలిపారు. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఆటోల వారు చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించవచ్చు అన్నారు.

Similar News

News September 17, 2025

1948 SEP 17 తర్వాత HYDలో ఏం జరిగింది?

image

‘ఆపరేషన్ పోలో’ తర్వాత HYD సంస్థానాదీశుడు నిజాం భారత ప్రభుత్వానికి తలొగ్గారు. ‘గోల్కొండ ఖిలా కింద ఘోరి గడతాం’అని ఎవరిపై ప్రజలు తిరగబడ్డారో ఆయనను ప్రభుత్వం తెలంగాణకు రాజ్ ప్రముఖ్‌గా నియమించి గౌరవించింది. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని పాకిస్థాన్‌కు పంపింది. 1952లో జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలను పీడించిన ప్రభువుల కథ సుఖాంతం అయింది.

News September 17, 2025

AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<> AICTE<<>> , కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లు ఆర్థిక సాయం చేస్తారు.

News September 17, 2025

జగిత్యాల : హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

image

పొలాస-గుల్లపేట గ్రామాల సమీపంలో జరిగిన ఆటో డ్రైవర్ నహిముద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. బీహార్ కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్నిలు అద్దెకు ఆటో మాట్లాడుకుని వెళ్లారు. అద్దె విషయంలో గొడవ జరిగి గుడ్డతో ఉరివేసి తరువాత బండతో మోది హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.