News March 10, 2025
నేరాలను అదుపు చేసేందుకు సీరియల్ నంబర్లు: పార్వతీపురం SP

నేరాలను అదుపు చేసేందుకు పట్టణంలో ఒకే ఆటో ఒకే సంఖ్య విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్. వి మాధవరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటో యూనియన్లు ఎన్ని ఆటోలు ఉన్నాయి, యూనియన్లు, డ్రైవర్లు, ఆటోలకు సంబంధించిన రికార్డులన్నీ సమీప పోలీస్ స్టేషన్లలో నమోదు చేయించిన తెలిపారు. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఆటోల వారు చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించవచ్చు అన్నారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి: రేపు ఏమేం చేయాలో తెలుసా?

పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, 30 వత్తుల దీపం వెలిగించాలి. దాన్ని అరటి దొప్పలలో పెట్టి పారే నీటిలో వదలాలి. తద్వారా కార్తీక మాస దీపారాధన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి, శివ లింగానికి అభిషేకం చేసి ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి, పోలి స్వర్గం కథ విని, దీపదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
News November 20, 2025
AVNLలో 133 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)లో 133 పోస్టులకు ఆఫ్లైన్లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. Jr టెక్నీషియన్, Environ. Eng, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్, BSc(ENG.), డిగ్రీ, PG, MBA, PGBDM, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు NTC/NACగల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
News November 20, 2025
MHBD: వృద్ధురాలి దారుణ హత్య.. UPDATE

MHBD(D) రామన్నగూడెంలో నిన్న <<18334484>>వృద్ధురాలు హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల ప్రకారం.. కురవి(M)కి చెందిన పద్మ భర్త మృతి చెందడంతో 2వ కూతురి ఇంట్లో ఉంటోంది. కూతురు, అల్లుడు HYDలో ఉంటుండగా ఒంటరిగా ఉంటోంది. ఉదయం నుంచి పద్మ బయటికి రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా రక్తపు గాయాలతో పడి ఉంది. SI రమేశ్ బాబు కేసు నమోదు చేశారు. బంగారం కోసమా? అత్యాచారంచేసి హత్య చేశారా? అనేది దర్యాప్తులో తేలనుంది.


