News August 30, 2024

నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: నంద్యాల ఎస్పీ

image

నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అధికారులకు ఆదేశించారు. గురువారం ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నైట్ బీట్, పెట్రోలింగ్ పెంచి నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 28, 2025

ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

image

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్‌క్వార్టర్‌గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్‌క్వార్టర్‌గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.

News November 28, 2025

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.

News November 28, 2025

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.