News November 20, 2024

నేరాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి: SP

image

సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మన్యం జిల్లా పార్వతీపురం ఎస్పీ SV మాధవరెడ్డి సూచించారు. పార్వతీపురం పోలీస్ వెల్ఫేర్ ఫంక్షన్ హాలులో జిల్లాలోని బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలు జరిగిన తరువాత బాధపడే కన్నా నేరం జరగకుండా తగు జాగ్రత్తలు పాటించడం మేలన్నారు. దర్యాప్తు అధికారులు కోరిన సమాచారం అందించి సైబర్ నేరాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని కోరారు.

Similar News

News March 13, 2026

VZM: RRB గ్రూప్-D పరీక్షలకు ఫ్రీ కోచింగ్

image

విజయనగరం జిల్లాలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు. RRB గ్రూప్‌-D పరీక్షలకు 2 నెలల శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తారు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు. అర్హులు తమ బయోడేటా, టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్, ఇన్‌కమ్, తదితర ధ్రువపత్రాలతో కస్పా హైస్కూల్లో గల BC స్టడీసర్కిల్‌ కార్యాలయానికి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

News March 13, 2026

పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం: VZM ఎస్పీ

image

ఆరు నెలల్లో జిల్లాలో నమోదైన 17 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. శిక్షల పరంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని, ప్రేమ పేరుతో మోసం చేసే వారి మాటలు నమ్మవద్దని సూచించారు.

News March 13, 2026

కలెక్టరేట్‌లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి: కలెక్టర్

image

కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘ సభ్యులు, ప్రజలు హాజరుకావాలని ఆయన సూచించారు.