News July 4, 2024

నేరేడుచర్ల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా: మంత్రి ఉత్తమ్

image

నేరేడుచర్ల అభివృద్దే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ బి.ప్రకాష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని ఆదిశగా పనిచేయాలని సూచించారు.

Similar News

News November 28, 2025

నగదును ఎలా స్వీకరిస్తున్నారు?.. ఇలా త్రిపాఠి వాకబు

image

గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె మర్రిగూడ మండలం సరంపేట, శివన్నగూడెం, వట్టిపల్లి గ్రామాలలో పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు సమర్పించే నగదును ఎలా స్వీకరిస్తున్నారని ? అలాగే వారికి రశీదు ఇస్తున్నారా? అని కలెక్టర్ సిబ్బందిని అడిగారు.

News November 28, 2025

NLG: హుండీ లెక్కింపు.. ఆదాయం@రూ.42 లక్షలు!

image

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం హుండీలను శుక్రవారం లెక్కించారు. 49 రోజులకు సంబంధించి రూ.42,87,544 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సాల్వాది మోహన్ బాబు తెలిపారు. అలాగే అన్నదానం కార్యక్రమానికి భక్తులు సమర్పించిన హుండీని లెక్కించగా రూ.42374లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 39 అమెరికా, 5 కెనడ, 10 శ్రీలంక డాలర్లు వచ్చినట్లు తెలిపారు.

News November 28, 2025

ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేయొచ్చు: ఇలా త్రిపాఠి

image

కలెక్టర్ ఇలా త్రిపాఠి మర్రిగూడ మండలం సరంపేట నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, మర్రిగూడ తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మున్నయ్య తదితరులు పాల్గొన్నారు.