News June 16, 2024

నేరేడుచర్ల: విద్యుత్ ప్రమాదంలో ఆపరేటర్ మృతి

image

నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామం పరిధిలోని వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మండవ నాగేశ్వరరావు( 40) అక్కడికక్కడే మృతి చెందారు. గరిడేపల్లి మండలం తాల్ల మల్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు నేరేడుచర్ల మండలం ముకుందపురం సబ్ స్టేషన్‌లో విద్యుత్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తూ నేరేడుచర్ల పట్టణంలో నివసిస్తున్నారు.

Similar News

News October 27, 2025

NLG: నకిలీ స్వీట్ల దందా.. తింటే అంతే సంగతి!

image

నల్గొండలో కొందరు వ్యాపారులు కాలం చెల్లిన, పురుగులు పట్టిన ముడి పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడానికి హానికరమైన రసాయనాలను కలుపుతున్నట్లు ఇటీవల అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇటువంటి మిఠాయిలు తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News October 27, 2025

NLG: కల్లాల్లోనే ధాన్యం.. త్వరగా కొనరే..!

image

నల్గొండ జిల్లాలో రైతన్నలను కష్టాలు వెంటాడుతున్నాయి. 186 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం వేగంగా జరగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావం ఉంటుందని వార్తలు వస్తున్నాయని కల్లాల్లోనే ధాన్యం ఉంటే తీవ్రంగా నష్టపోతామంటున్నారు. కాగా జిల్లాలో ఇంకా 150 కేంద్రాలు తెరుచుకోవాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో కల్లాలలోని ధాన్యం తడవడంతో పాటు వరదకు కొట్టుకుపోయింది.

News October 27, 2025

నేతలకు సవాల్‌గా నల్గొండ డీసీసీ

image

నల్గొండ DCC ఎంపిక మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో పాటు సీనియర్ నేత జానారెడ్డికి సవాల్‌గా మారింది. బీసీ వైపు మొగ్గుచూపితే చనగాని దయాకర్, పున్న కైలాష్ నేత, చామల శ్రీనివాస్, రాజా రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ అయితే కొండేటి మల్లయ్యకు ఇచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఓసీ అయితే గుమ్ముల మోహన్ రెడ్డికి డీసీసీ పీఠం దక్కే అవకాశముంది. ఎవరికి వారు అగ్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.