News February 13, 2025

నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు వేమనపల్లి విద్యార్థిని ఎంపిక

image

నీల్వాయికి చెందిన 8వ తరగతి విద్యార్థిని నేహస్విత ఇటీవల నిర్వహించిన ఎన్‌ఎం‌ఎం‌ఎస్ స్కాలర్షిప్ పోటీ పరీక్ష రాసి ఎంపికైంది. నీల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వరుసగా విద్యార్థులు NMMSకు ఎంపిక కావడం విశేషం. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ వస్తుంది. ఉపాధ్యాయులు బృందం మరియు తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.

Similar News

News March 16, 2025

కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్‌తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News March 16, 2025

జిల్లా అధికారులను అభినందించిన జనగామ కలెక్టర్

image

స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను జిల్లా అధికారులందరినీ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అభినదించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు గత వారం రోజులుగా నిర్విరామంగా విశేష కృషి చేశారని కలెక్టర్ అన్నారు. అందరి సమన్వయ కృషి వల్లే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.

News March 16, 2025

ప.గో.జిల్లా వ్యాప్తంగా 128 టెన్త్ పరీక్ష కేంద్రాలు

image

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 128 సెంటర్ల ద్వారా 22,432 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ తెలిపారు. వీరిలో 11,407 మంది బాలురు కాగా 11,025 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు.

error: Content is protected !!