News February 3, 2025

నేషనల్ లెవెల్‌లో కొత్తగూడెం జిల్లా వాసులు సత్తా

image

కేరళ కున్నాంకులంలో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్ ఈ పోటీల్లో భద్రాద్రి జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు.  200 మీటర్స్‌లో దుమ్ముగూడెం మం. పత్తిపాకకు చెందిన అపకా సతీష్ మొదటి బహుమతి, సింగవరానికి చెందిన కల్లూరి మురళి రెండో బహుమతి కైవసం చేసుకున్నారు. పలువురు వారిని అభినందించారు.

Similar News

News April 16, 2026

పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

image

శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష (పాలిసెట్-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు. 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News April 16, 2026

టీబీ రహిత జిల్లాయే లక్ష్యం: కలెక్టర్

image

వచ్చే సంవత్సరం టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పేర్కొన్నారు. గురువారం ఎల్కతుర్తిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆశా, ఏఎన్ఎం సిబ్బంది కృషితో జిల్లాలో టీబీ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఎల్కతుర్తిని టీబీ రహిత మండలంగా మార్చాలన్నారు. సర్పంచ్ లావణ్య, డీఎంహెచ్వో అప్పయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

News April 16, 2026

యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్లాన్ ఇదేనా?

image

ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలంటే ఆ దేశంపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఏకైక మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా వైట్ హౌస్‌లో నెదర్లాండ్స్ రాజు అలెగ్జాండర్‌తో జరిగిన ప్రైవేట్ డిన్నర్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హార్ముజ్‌ను దిగ్బంధించినట్లు టాక్. అదే నిజమైతే భారత్ సహా పలు దేశాలు మరికొన్నాళ్లు చమురు సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.