News February 27, 2025
నోరుంది కదా అని వాగితే పోసాని గతే: MLA సోమిరెడ్డి

నోరుంది కదా అని నీచంగా వాగేవాళ్లకు ఏ గతి పడుతుందో పోసాని ఉదంతమే నిదర్శమని MLA సోమిరెడ్డి తెలిపారు. పోసాని అరెస్టుపై స్పందిస్తూ.. ఈ ఘటనను తెలుగు ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్పై ఆయన వాడిన భాషకు 111 సెక్షన్ చాలదేమో అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఓ డైరెక్టర్ను మాత్రం అరెస్ట్ చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు సోమిరెడ్డి పేర్కొన్నారు.
Similar News
News February 28, 2026
అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.
News February 28, 2026
నెల్లూరు: 3.45 లక్షల ఎకరాల్లో వరిసాగు.!

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలు దక్కడం లేదు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 3.45 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రానుంది. వచ్చే నెల నుంచి జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News February 27, 2026
UPSC అభ్యర్థులకు ట్యాబ్ల అందజేత

యూపీఎస్సీ(UPSC) పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్సు శుక్లా అధ్యాయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.


