News February 11, 2025
నోరు అదుపులో పెట్టుకోండి: పరిటాల సునీత హెచ్చరిక

వైసీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ.. గుంతపల్లి గ్రామంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన గొడవను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ కేసులు పెట్టించిన ప్రకాశ్ రెడ్డి పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసత్య ఆరోపణలు తగవని హెచ్చరించారు.
Similar News
News November 23, 2025
2 రోజుల్లోనే ముగిసిన టెస్టు.. రూ.17.35 కోట్ల నష్టం!

యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టు కేవలం 2 రోజుల్లో ముగియడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగో రోజులకు అమ్మకానికి ఉంచిన టికెట్ ఆదాయం కోల్పోవడంతో దాదాపు రూ.17.35 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. మూడో రోజు టికెట్లు దాదాపు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొదటి రెండు రోజుల్లోనే లక్షకుపైగా అభిమానులు హాజరైనా, తర్వాతి రోజుల ఆదాయం కోల్పోవడం గట్టిదెబ్బే.
News November 23, 2025
ఇది ప్రభుత్వ బాధ్యారాహిత్యమే: జడ్పీ ఛైర్మన్

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యారాహిత్యానికి నిదర్శనమని జడ్పీ ఛైర్మన్, YCP జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఆదివారం విమర్శించారు. కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల ఇప్పటికే రైతులు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన తమ హయంలో జరిగిందని, 23 శాతం నిర్మాణ పనులు కూడా YCP ప్రభుత్వంలోనే పూర్తయ్యాయన్నారు.
News November 23, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


