News October 26, 2024

నోరు పారేసుకోవ‌డంలో సీఎం రేవంత్ రెడ్డిని మించి పోతున్నారు: రాకేశ్ రెడ్డి

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు, మంత్రులు నోరు పారేసుకోవ‌డంలో సీఎం రేవంత్ రెడ్డిని మించి పోతున్నారంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. ఆయ‌న ఎక్స్ వేదిక‌గా మాజీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న మ‌హిళ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రాను రాను దిగ‌జారుడు మాట‌ల‌తో స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా చేస్తున్నారని అన్నారు.

Similar News

News December 1, 2025

గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

image

వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డ్ మెంబర్ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నియమించిన నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు నోడల్ అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

News December 1, 2025

ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

image

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.

News December 1, 2025

వరంగల్‌: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

image

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.