News January 31, 2025
న్యాయవాదులకు విశాఖ జిల్లా న్యాయమూర్తి సూచన

న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచించారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కోర్టులో కొత్తగా దాఖలయ్యే దావాలు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారానికి ముందు మధ్యవర్తిత్వానికి పంపిస్తామన్నారు. మధ్యవర్తత్వంలో మెళుకువలను ఆయన వివరించారు. శిక్షకులు సత్యారావు, రత్నతార, జిల్లా న్యాయ సేవాధివార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ ఉన్నారు.
Similar News
News December 16, 2025
విశాఖ: సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈఓకు డాక్టరేట్

ఆంధ్ర విశ్వవిద్యాలయం కామర్స్ మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి, సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈఓ ఓరుగంటి నరేష్ కుమార్కు డాక్టరేట్ లభించింది. “వర్క్ప్లేస్ డైనమిక్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ది ఐటీ సెక్టార్ పోస్ట్ పాండమిక్-ఏ కేస్ స్టడీ ఆన్వర్క్ ఫ్రమ్హోమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై లోతైన అధ్యయనానికి ఈడాక్టరేట్ ప్రదానం చేశారు.
News December 16, 2025
సింహాచలం కొండపై HT లైన్లకు గ్రీన్ సిగ్నల్

సింహాచలం కొండపై నుంచి NSEL వరకు HT విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏపీ ట్రాన్స్కోకు అనుమతినిచ్చింది. ఈప్రాజెక్టులో భాగంగా దేవస్థాన భూముల్లో 27 టవర్ల లైన్లు వేయాల్సి ఉంది. ఇందుకుగాను వాడుకున్న స్థలానికి పరిహారంగా ట్రాన్స్కో ద్వారా దేవస్థానానికి రూ.15కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపనులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
News December 16, 2025
విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి లోకేశ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్గా పదవీ విరమణ పొందిన తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సతీశ్వరరెడ్డి కోరారు. కోనసీమ, పోలవరంలో గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలనీ కోరారు.


